Monday, July 25, 2011

గోమాత విశిష్టత 6 – గోవు ఆరోగ్యకారి మరియు ఆర్థిక ప్రయోజనకారి

గోమాత విశిష్టత 6 – గోవు ఆరోగ్యకారి మరియు ఆర్థిక ప్రయోజనకారి

గోమాత విశిష్టత
Indian Cow


గోమూత్రం – ఇది కఫము నణచునది, జీర్ణశక్తి పెంచునది, కుష్టు, ఉబ్బు, పాండువు, గుర్మం శూల, శ్వాస, కాస, మూత్రకృచ్చం, మూలవ్యాధి, జ్వరము, జఠరొగాలు, వాతం, క్రిమిరోగం వంటివానికిది ఔషధం. మలబధ్ధకాన్ని తొలగించటం, దీర్ఘరోగ నివారణం చేస్తుంది. పుడిసెడు మొదలు దోసెడు దాకా ఉదయంపూట లోపలకు పుచ్చుకొను విధానం. గోమూత్రంవల్ల ఎన్నో వ్యాధులు నయమౌతాయని సుష్రుతుడు చెప్పాడు. గోమూత్ర పురీషాలు లోపలకు పుచ్చుకొనటంవల్ల దేహానికి గల అనారోగ్యాలు దూరమౌతాయని యూరప్ దేశస్థులు పరిశోధనచేసి గ్రహించారని, ఆచరించి సత్ఫలితాలు పొందారని సుప్రసిధ్ధ పాశ్చాత్య వైద్యులు డా. మైకేల్ తాను వ్రాసిన హ్యాండ్ బుక్ ఆఫ్ బార్టియాలజీ గ్రంధం 45వపుటలో వ్రాశారు. గోమూత్రం ఎరువులలో బాగా ఉపకరిస్తుంది.


గోమయం - ఆవుపేడ మలినము దుర్గంధాలను పోగొట్టేది. ఇది విషవాయుదోషాన్ని హరిస్తుంది. ఉన్మాదశాంతినికూడా కల్గిస్తుంది. దీనికి కలరా, మశూచి వంటి రోగక్రిములను సంహరింపగల శక్తికూడా ఉంది. వాతావరణ కాలుష్యాన్ని తొలగిస్తుంది. ఆవులకు జొన్నలు పెట్టి అవి పేడతోబాటు బయటకువచ్చిన తరువాత తీసి కడిగి దంచిభుజిస్తే కార్యసిధ్ధి, మహత్తర ఆధ్యాత్మికశక్తి ఏర్పడుతుంది. శ్రీ ప్రభుదత్త బ్రహ్మచారి, పండిత శ్రీరామశర్మ ఆచార్యగార్లు ఆవిధానా న్నుసరించియే ఫలితం సాధించారు. ఆవుపేడలో మెంధాల్, అమ్మోనియా, ఫినాయల్, ఇండాల్, ఫార్మాలిన్ క్రిమినాశక పదార్థాలున్నాయి. గ్రామాలలో ఆవుపేడతో కళ్లాపు చల్లటం, గోడలకు ఆవుపేడ అలకటంలోఉన్న విజ్ఞానాన్ని విజ్ఞానవేత్తలు కొనియాడారు. విదేశాలలో డాక్టర్లు ఆవుపేడతో చేసిన పిడకల పొగను రోగులచే పీల్చునట్లు చేసి సత్ఫలితాలను పొందారు. ఆవుగిట్టలు, కొమ్ములు, వెంట్రుకల పొగవేస్తే కూరగాయల చెట్లకు పట్టే చీడలు తొలగిపోతాయి. సమస్త దోషాలు, క్రిములు తొలగింపగల ఆవుపేడను శుద్దికి ప్రశస్తంగా హిందూసంప్రదాయం స్వీకరించింది. ఆవుపేడతో ఇల్లు అలుకుకొనటం ఎంతో ఆర్థిక ప్రయోజనకారి. కొందరు ముదుసలిఆవు లెందుకు? వానిని చంపితే ఏం? అని అంటారు. గాంధీగారి శిష్యులు, విజ్ఞానవేత్తలు శ్రీ పాంధరీ పాండే అనేవారు 24 సం. కృషిచేసి ముదుసలి ఆవులుసైతం ఆర్థికంగా ప్రయోజనకరాలని నిరూపించారు. ఒక కిలో ఆవుపేడలో 40 కిలోల కంపోస్టుఎరువు తయారు చేయవచ్చని నిరూపించారు. ఆవుపేడతో ఋతురాజు రంగు తయారుచేశారు. ఈ రంగు పూయడంవల్ల ఇల్లు వేసవికాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంటుంది. యుధ్ధాలలో మారణాయుధాల విషవాయుప్రమాదంనుండికూడా ఇది రక్షణనిస్తుందని నిరూపించారు. ఆవుపేడలో కొన్ని ద్రవ్యాలు కలిపి అగరువత్తులు, బట్టలుతికే పౌడరుకూడా తయారుచేశారు. గోమయం కీటాణువుల పాలిటి మృత్యువే. గోమూత్రంకూడా ఎరువులలో వాడటంవల్ల కీటాణువులు, క్రిములు నాశనంచేసే ఉత్తమఎరువు తయారవుతుంది. కాబట్టి ముదుసలి ఆవులనైనా వధ్యశాలకు పంపటం వినాశహేతువే. ఒక సంవత్సరం పొడువునా ఒక్క ఆవువల్ల లభించే పేడతో 80 టన్నుల ఎరువు తయారుచేయవచ్చు. ఎనిమిది ఎకరాలలో సరిపోయే ఆ ఎరువువెల బజారులో Rs. 17,885/- గా నిర్ణయింపబడింది. గోవర్థన సంస్థ సంయోజకులు చెత్తవంటివి చేర్చి గోమయం వృధాచేయక ప్రయోగాత్మకముగా నిరూపించారు.



www,jayahanumanji.com