Showing posts with label Gomatha. Show all posts
Showing posts with label Gomatha. Show all posts

Monday, August 29, 2011

గోమాత విశిష్టత 8 – వైద్య ప్రయోజనాలు, సాధించే విధానాలు


గోమాత విశిష్టత 8 – వైద్య ప్రయోజనాలు, సాధించే విధానాలు

గోమాత విశిష్టత
Gomatha - Indian Cow


ఆవుపాలతో అల్లపురసం, తేనెలు సమంగా కలిపి 3 ఔన్సులు ఉదయం మాత్రం పుచ్చుకొనడంవల్ల మంచి ఆకలి కలుగుతుంది.  మినపపప్పు నేతితో వేయించి చూర్ణం చేసి ఆవుపాలలో పంచదార కలిపి వండించి పరమాన్నం చేసి వాడితే ఇంద్రియ పుష్టి కలుగుతుంది. రెడ్డివారినానుబాలు రసంతీసి పిప్పళ్ళు తగుమాత్రం ఆ రసంలో నానేసి తీసి ఎండించి ఇలా 5 మార్లు చేశాక దాన్ని చూర్ణంచేసి పంచదార కలిపి పూటకొక తులం పుచ్చుకొంటూ ఆవుపాలు తాగితే ఇంద్రియం గట్టిపడుతుంది. ఆకాలంలో పుష్టికర ఆహారం తీసికొనాలి. వేపకట్టె బొగ్గు అరతులం, మంచి గంధపుచెక్క అరతులం, బెల్లం అరతులం చూర్ణంచేసి పేరుకొన్న ఆవునేతితో పుచ్చుకొంటే ఉబ్బసపు దగ్గు తగ్గుతుంది. ఆవుపాలతో కలబంద గుజ్జు, మిరియాలపొడి, పంచదార కలిపి పుచ్చుకొన్న ఉబ్బసం తగ్గుతుంది. తొమ్మిది ఔన్సుల ఆవుపెరుగులో మూడు చుక్కల కాకరాకు చుక్కల కాకరాకు పసరువేసి ఉదయంమాత్రం త్రాగితే ఉబ్బుకామెర్లు తగ్గుతాయి. పథ్యనియమంకూడా లేదు.

వావిలిఆకు సమూలం, గుంటకలగర సమూలం సమభాగాలుగా రెండూ కలిపి సుమారుగా ఒకతులం నూరి గిద్దెడు ఆవుపాలతో కలిపి పరగడపున ముట్టు మూడు రోజులు ఈయాలి. ఎటువంటి ముట్టునొప్పిఅయినా పోతుంది. ఆ ముట్టు మూడురోజులు పాలుఅన్నం మాత్రం తినాలి. నాగకేసరములు చూర్ణంచేసి ఆవునేతితో కలిపి స్త్రీ వాకిటనున్న కాలంలో ఇవ్వాలి. పథ్యనియమంలేదు. గర్భమును నశింపజేసే పురుగు దీనివల్ల చచ్చిపోయి గర్భము నిలుస్తుంది. పావుతులం కాకిదొండదుంప చూర్ణం, కాచని ఆవుపాలు నాలుగు ఔన్సులతో కలిపి బయటజేరినరోజు మొదలు నాలుగురోజులు పరగడపున పుచ్చుకొనాలి. ఆవుపాల అన్నం తినాలి. ఇదీ గర్భాన్ని నిలుపుతుంది. మరోపధ్ధతి పెన్నేరుగడ్డ కషాయం కాచి 6 ఔన్సుల కషాయం వడపోసి తీసికొని 6 ఔన్సుల ఆవుపాలు కలిపి కాచి, కషాయం మరిగిపోయి పాలు మిగిలిన పిదప 2 టీస్పూన్ల నేయి కలిపి ముట్టుస్నానం రోజున పుచ్చుకొంటే గర్భం నిలుస్తుంది.


by Dr Annadanam Chidambara Sastry

Thursday, August 25, 2011

గోమాత విశిష్టత 7 – వ్యవసాయంలో గోవు, గోసంతతి ప్రయోజనం, ప్రాముఖ్యత

గోమాత విశిష్టత 7 – వ్యవసాయంలో గోవు, గోసంతతి ప్రయోజనం, ప్రాముఖ్యత

గోమాత విశిష్టత
Indian Cows in Agriculture


చాలా ముఖ్య విషయ మేమంటే ప్రఖ్యాత విజ్ఞానశాస్త్రవేత్త డా. ఆల్బర్ట్ ఐన్ స్టీన్ 1948 లో మన దేశానికి వచ్చే డా. అమర్ నాధ్ ఝా అనే విద్యవేత్త ద్వారా ఒక సందేశం పంపారు. అది ‘భారతదేశంలో ట్రాక్టర్లవంటి యంత్రాలద్వారా నడిచే వ్యవసాయాన్ని అమలుచేయవద్దు. 400 సంవత్సరాలపాటు యంత్రాలద్వారా వ్యవసాయం చేయడంవల్ల అమెరికాదేశపు వ్యవసాయభూమి నిస్సారమైపోయింది. 10వేల సంత్సరాలపైగా వ్యవసాయం సాగుచున్న భారతదేశపు మట్టిలో సారం, శక్తీ ఇప్పటికీ తరిగిపోలేదు’ అన్నారు. యంత్రములద్వారాకాక గోసంతతిద్వారా వ్యవసాయం చేయటంలోని ప్రయోజనం ఆ శాస్త్రవేత్త సందేశంద్వారా అయినా గ్రహింపక గోసంతతిని నాశనం చేసికొని వినాశందిశగా పరుగులెత్తుతున్నాం. రసాయనిక వనరులతో సాగుతున్న వ్యవసాయం భోజనవిధానాన్ని కుంచింపజేసింది. తత్ఫలితమే ఈనాటి ప్రమాదకరమైన రోగాలు, వాతావరణ కాలుష్యాలు. అందుకే సర్ హోవర్ట్ ‘యంత్రాలద్వారా సాగే వ్యవసాయంలో రసాయనిక ఎరువులు, క్రిమినాశకమందులు తప్పనిసరి అవుతాయి. యంత్రాలద్వారా జరిగే వ్యవసాయపు టెక్నాలజీ భయంకరమైన వాతావరణకాలుష్యాన్ని వ్యాప్తంజేస్తుంది. అనర్థాలకు ఆలవాలమైన యాంత్రిక వ్యవసాయాన్ని వైజ్ఞానికం అనటం తప్పు’ అన్నారు. పంట దిగుబడి యాంత్రిక, రసాయనిక వ్యవసాయం వలననే పెరిగిన దనుకొనటం భ్రాంతి. పరిశోధనాత్మక కృషితో దేశీయ విధానంలోను వ్యవసాయంచేసి ప్రమాదకరమైన రోగాలకు నిలయంకాని మంచి దిగుబడిని సాధింపవచ్చు.



‘Institute of Economics Guidance in India’ అనే ప్రభుత్వసంస్థ లెక్కల ప్రకారం మన ఎడ్లనిటినీ వ్యవసాయంనుండి తీసేస్తే 2 కోట్ల ట్రాక్టర్లు అవసరమౌతాయట. అందుకు 4,50,000 కోట్ల పెట్టుబడి అవసరమౌతుంది. ఈ ట్రాక్టర్లను నడపటానికి ఏటా 1,75,000 కోట్ల రూపాయల డీజిల్ అవసరం. గోసంపద నాశనమవటంతో యాంత్రిక వ్యవసాయం, దానివల్ల చీడపీడలు పెరిగి రసాయనిక ఎరువులు వాడటంతో రైతుమిత్రులు వానపాములవంటి అవసరజీవులు నశించి భూసారం దెబ్బతిని పైర్లకు రోగాలురాగా క్రిమిసంహారక మందులవాడికతో భూమి విషతుల్యమై సమస్యల వలయాలలో చిక్కి రైతు ఆత్మహత్యకు దిగటం చూస్తున్నాం. గోమాతను, భూమాతను నమ్ముకుంటే ఈగతి పట్టదు. స్వాతంత్ర్యం వచ్చిననాటికి మనదేశంలో 36 కోట్ల పశువులుండగా మరి ఏబదియేండ్లకు అవి 10 కోట్లకు తగ్గిపోయాయి. మాంసం ఎగుమతి 9500 టన్నులకు పెరిగి 30 యాంత్రిక పశువధశాలలకు అనుమతి వచ్చింది. కాడి జోడెడ్లు, ఆవుదూడలను అసలు వాడికలో లేకుండా చేస్తూ ఎలక్షన్లలో వాడుకోవడం మాత్రం జరిగింది. ఇతరదేశాలు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులవై నడుస్తోంటే మనం దుబాయ్ షేకులకు మాంసం అమ్ముకొంటూ ప్రమాదంలోకి పోతున్నాయి.
మరో ముఖ్యవిషయ మేమంటే భూకంపాలకు కారణంగూర్చి 1995లో మాస్కో సమీపంలో జరిగిన అంతర్జాతీయ సమ్మేళనంలో పరిశోధనా పత్రాలలో వివరింపబడింది. ఐన్
స్టీన్ చెప్పిన వేదనాతరంగాలవలె వీరు వెలుగులోకి తెచ్చిన ‘బిస్ ప్రభావము’ భూకంపాలకు కారణమని, ఆ ‘బిస్ ప్రభావానికి’ పశువధశాలలు కారణమని పరిశోధకులు వివరించారు. ఆవుపేడ పిడకలు కాల్చటంవలన వచ్చే పొగ, ఆవుపేడతో అలికిన గోడలు అణుశక్తివల్ల వచ్చే రేడియేషన్ నుండి కాపాడగలవని విదేశీ శాస్త్రజ్ఞులు ఋజువు చేస్తున్నారు. ఆవునెయ్యితో చేసే హోమంవలన వచ్చేపొగ వాతావరణంలోని అనారోగ్య క్రిములను, ఎలర్జీని పోగొడుతుందని, గోవు ఉండటమే గొప్ప పర్యావరణ పరిరక్షణ అని చెప్తున్నారు. రసాయన ఎరువులు, పురుగుమందులు విశృంఖలంగావాడి ఆ ఆహారపదార్థాలను తినడంవల్ల కేన్సర్ వ్యాధి సోకేప్రమాదముందని, కిడ్నీ చెడిపోయే ప్రమాదముందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఎరువు, పురుగుమందులు అధికంగా ఉపయోగించడం వలన మనదేశంలో ఏటా 30,000 మంది రైతులు మృత్యువువాత పడుతున్నారని, గోమూత్రం, పేడతో, ఎరువులు వాడితో పై ప్రమాదాలేవీ ఉండవని మేనకాగాంధీ చెప్పారు. వాటివల్ల కాలుష్యం ఏ స్థాయికి వచ్చిందంటే పసిపిల్లలకు తల్లులిచ్చే చనుబాలుకూడా కలుషితమయే తీవ్రస్థాయి ఏర్పడుతోంది. కోటానుకోట్ల ధనం ఎరువులకు, పాలపొడికి వెచ్చిస్తూ గోమాంసం, తోళ్ళు అమ్ముకొని అనేక నష్టాలపాలవడం కాక, భూమిని, మన శరీరాన్ని రోగమయం చేసికొని వినాశాన్ని కొనితెచ్చు కొంటున్నామన్నమాట. ఒక పశువుమూత్రం వినియోగించి సాలీనా 36,000 రూపాయల విలువైన ఎరువులు తయారుచేసుకోవచ్చని పరిశోధకులు తేల్చారు. గోవుకోసం మనం అంత ఖర్చుపెట్టంకదా! బి.హెచ్.సి., DDT, ఎండ్రిన్, ప్యారామాల్ మోనోక్రోటోఫాస్ వంటి మందులు ఆయాదేశాలలో వాడటం నిషేధించడంతో వానిని మనం కొనితెచ్చుకొని ప్రమాదం కొనితెచ్చుకొంటున్నాము. ఆ దేశాలు వాటిని ఎందుకు నిషేధించాయో, అయినా ఉత్పత్తి చేసి మననెత్తిన ఎందుకు రుద్దుతున్నారో మనం గుర్తించడంలేదు. వాటివల్ల జీన్స్ లోపంకలిగి భవిష్యత్తరాలు దెబ్బతినడానికికూడా మనం విషబీజం నాటుతున్నాం.


http://www.jayahanumanji.com/
By Dr. Annadanam Chidambara Sastry

Monday, July 25, 2011

గోమాత విశిష్టత 6 – గోవు ఆరోగ్యకారి మరియు ఆర్థిక ప్రయోజనకారి

గోమాత విశిష్టత 6 – గోవు ఆరోగ్యకారి మరియు ఆర్థిక ప్రయోజనకారి

గోమాత విశిష్టత
Indian Cow


గోమూత్రం – ఇది కఫము నణచునది, జీర్ణశక్తి పెంచునది, కుష్టు, ఉబ్బు, పాండువు, గుర్మం శూల, శ్వాస, కాస, మూత్రకృచ్చం, మూలవ్యాధి, జ్వరము, జఠరొగాలు, వాతం, క్రిమిరోగం వంటివానికిది ఔషధం. మలబధ్ధకాన్ని తొలగించటం, దీర్ఘరోగ నివారణం చేస్తుంది. పుడిసెడు మొదలు దోసెడు దాకా ఉదయంపూట లోపలకు పుచ్చుకొను విధానం. గోమూత్రంవల్ల ఎన్నో వ్యాధులు నయమౌతాయని సుష్రుతుడు చెప్పాడు. గోమూత్ర పురీషాలు లోపలకు పుచ్చుకొనటంవల్ల దేహానికి గల అనారోగ్యాలు దూరమౌతాయని యూరప్ దేశస్థులు పరిశోధనచేసి గ్రహించారని, ఆచరించి సత్ఫలితాలు పొందారని సుప్రసిధ్ధ పాశ్చాత్య వైద్యులు డా. మైకేల్ తాను వ్రాసిన హ్యాండ్ బుక్ ఆఫ్ బార్టియాలజీ గ్రంధం 45వపుటలో వ్రాశారు. గోమూత్రం ఎరువులలో బాగా ఉపకరిస్తుంది.


గోమయం - ఆవుపేడ మలినము దుర్గంధాలను పోగొట్టేది. ఇది విషవాయుదోషాన్ని హరిస్తుంది. ఉన్మాదశాంతినికూడా కల్గిస్తుంది. దీనికి కలరా, మశూచి వంటి రోగక్రిములను సంహరింపగల శక్తికూడా ఉంది. వాతావరణ కాలుష్యాన్ని తొలగిస్తుంది. ఆవులకు జొన్నలు పెట్టి అవి పేడతోబాటు బయటకువచ్చిన తరువాత తీసి కడిగి దంచిభుజిస్తే కార్యసిధ్ధి, మహత్తర ఆధ్యాత్మికశక్తి ఏర్పడుతుంది. శ్రీ ప్రభుదత్త బ్రహ్మచారి, పండిత శ్రీరామశర్మ ఆచార్యగార్లు ఆవిధానా న్నుసరించియే ఫలితం సాధించారు. ఆవుపేడలో మెంధాల్, అమ్మోనియా, ఫినాయల్, ఇండాల్, ఫార్మాలిన్ క్రిమినాశక పదార్థాలున్నాయి. గ్రామాలలో ఆవుపేడతో కళ్లాపు చల్లటం, గోడలకు ఆవుపేడ అలకటంలోఉన్న విజ్ఞానాన్ని విజ్ఞానవేత్తలు కొనియాడారు. విదేశాలలో డాక్టర్లు ఆవుపేడతో చేసిన పిడకల పొగను రోగులచే పీల్చునట్లు చేసి సత్ఫలితాలను పొందారు. ఆవుగిట్టలు, కొమ్ములు, వెంట్రుకల పొగవేస్తే కూరగాయల చెట్లకు పట్టే చీడలు తొలగిపోతాయి. సమస్త దోషాలు, క్రిములు తొలగింపగల ఆవుపేడను శుద్దికి ప్రశస్తంగా హిందూసంప్రదాయం స్వీకరించింది. ఆవుపేడతో ఇల్లు అలుకుకొనటం ఎంతో ఆర్థిక ప్రయోజనకారి. కొందరు ముదుసలిఆవు లెందుకు? వానిని చంపితే ఏం? అని అంటారు. గాంధీగారి శిష్యులు, విజ్ఞానవేత్తలు శ్రీ పాంధరీ పాండే అనేవారు 24 సం. కృషిచేసి ముదుసలి ఆవులుసైతం ఆర్థికంగా ప్రయోజనకరాలని నిరూపించారు. ఒక కిలో ఆవుపేడలో 40 కిలోల కంపోస్టుఎరువు తయారు చేయవచ్చని నిరూపించారు. ఆవుపేడతో ఋతురాజు రంగు తయారుచేశారు. ఈ రంగు పూయడంవల్ల ఇల్లు వేసవికాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంటుంది. యుధ్ధాలలో మారణాయుధాల విషవాయుప్రమాదంనుండికూడా ఇది రక్షణనిస్తుందని నిరూపించారు. ఆవుపేడలో కొన్ని ద్రవ్యాలు కలిపి అగరువత్తులు, బట్టలుతికే పౌడరుకూడా తయారుచేశారు. గోమయం కీటాణువుల పాలిటి మృత్యువే. గోమూత్రంకూడా ఎరువులలో వాడటంవల్ల కీటాణువులు, క్రిములు నాశనంచేసే ఉత్తమఎరువు తయారవుతుంది. కాబట్టి ముదుసలి ఆవులనైనా వధ్యశాలకు పంపటం వినాశహేతువే. ఒక సంవత్సరం పొడువునా ఒక్క ఆవువల్ల లభించే పేడతో 80 టన్నుల ఎరువు తయారుచేయవచ్చు. ఎనిమిది ఎకరాలలో సరిపోయే ఆ ఎరువువెల బజారులో Rs. 17,885/- గా నిర్ణయింపబడింది. గోవర్థన సంస్థ సంయోజకులు చెత్తవంటివి చేర్చి గోమయం వృధాచేయక ప్రయోగాత్మకముగా నిరూపించారు.



www,jayahanumanji.com

Tuesday, June 7, 2011

గోమాత విశిష్టత 5 – గోవులు ప్రపంచజనులందరకూ తల్లులు

గోమాత విశిష్టత 5 – గోవులు ప్రపంచజనులందరకూ తల్లులు


గోవు వలన ప్రయోజనాలుః ఆవు మనకు అనేక విధాల ప్రయోజనకారి.ఆవుపాలుః పసిపిల్లలకు తల్లిపాలు అమృతసమాలు. తల్లిపాల తరువాత వారికి శ్రేష్టమైనవి ఆవుపాలే. తల్లిపాలు కొరవడిన పిల్లలకు ఆవుపాలు పట్టటమే సర్వవిధాల శ్రేయస్కరం. పసితనం దాటినా అట్టి తల్లిపాల అమృతఫలాన్ని అన్ని విధాలా పొందగల్గుటకు మార్గం గోమాతపాలు త్రాగటమే. కాబట్టే ‘గావః విశ్వస్య మాతరః’ గోవులు ప్రపంచజను లందరకూ తల్లులు అని వేదం చెప్పింది. ‘దేని లాభాలు లెక్కించలేమో అది గోవు’ అని యజుర్వేదం చెప్పింది. తల్లిపాలలోని గుణాలు, ఇంకా విశిష్టగుణాలుకూడా ఆవుపాలలో ఉన్నాయి. అందుకే పిల్ల, పెద్దలందరకూ అవి స్వీకరింపదగినవి. ఆవుపాలు సమశీతోష్ణంగా ఉంటాయి. మధురంగా ఉంటాయి. వీర్యపుష్టి, బలము, జఠరదీప్తి, దీర్హాయువు, బుద్దిబలం చేకూరుస్తాయి. జీర్ణజ్వరం తొలగిస్తాయి. స్త్రీల పిండోత్పత్తిస్థానానికి బలం చేకూరుస్తాయి. బాలింతలకు పాలుబడచేస్తాయి. అనేకవ్యాధులను ఆవుపాలు నయంచేస్తాయి. ఆవుయొక్క రంగును బట్టి ఈతలను బట్టి మేతలను బట్టి ఆవుపాలు ప్రత్యేక గుణాలు కలిగి ఉంటాయని వైద్యశాస్త్రం చెప్తోంది. నల్లఆవుపాలు పైత్యహరం. ఎరుపు ఆవుపాలు కఫహరం. చారలఆవులు వాతపైత్య హరం, త్రిదోష హరం, కపిలవర్ణపు ఆవుపాలు వీర్యపుష్టిని, కండ్లకు చలువను కలిగిస్తాయి. తెలకపిండిమేసిన ఆవుపాలు గురుత్వం, కఫం కలిగిస్తాయి. ప్రత్తిగింజలుమేసిన ఆవుపాలు అపథ్యం. పచ్చగడ్డిమేసిన ఆవుపాలు, ఎండు గడ్డిమేసిన ఆవుపాలు త్రిదోషహరం. తొలిఈత ఆవుపాలు బలము కలిగించి పైత్యం పోగొడతాయి. రెండవ ఈతవి వాతహరం, మూడవఈతవి శ్లేష్మవాతహరంకాగా, నాల్గవ ఈత ఆ పై ఈతల ఆవుపాలు త్రిదోషహరం. సాధారణంగా ఆవుపాలలో వైరస్ ను తొలగించే శక్తి ఉంది. ఆవుపాలు విరేచనం సాఫీగా అవటంలోనూ, కంటిచూపును అభివృధ్ది చేయడంలోనూ తోడ్పడతాయి. ఇవి వాజీకరం. ఆవుపాలను ఎప్పుడూ వాడుతూఉంటే వార్ధక్య బాధ సమీపించదు. ధారోష్ణధుగ్ధం అంటే పొదుగు నుండి వస్తూనే వేడిగా నుండే పాలు అమృతతుల్యం. ఏమాత్రం ఆలస్యమైనా పచ్చిపాలదోషం దానికి పడుతుంది. ఆవుపాలలో ఆధ్యాత్మికశక్తినికూడా పెంపొందించే గుణముంది. అందు సరస్వతి ఉంది.


Read the rest of this entry »
by Dr Annadanam Chidambara Sastry
http://www.jayahanumanji.com/

Wednesday, May 11, 2011

గోమాత విశిష్టత – 4

                             

                     స్మృతులను పరిశీలించినపుడు ‘గవా మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ’ అని 14 లోకాలూ గోవునం దున్నాయని, గోవునందు దేవతలంద రున్నారని పరాశరస్మృత్యాదులు వివరిస్తున్నాయి. బృహత్పరాశరస్మృతి గోదానాది మహిమ 5-34 నుండి 41 వరకు తెల్పింది. ఇంకా ‘గవాం చైవానుగమనం సర్వపాప ప్రణాశనమ్’ అని గురువువలె గోవు ననుసరించిపోవుట సర్వ పాపహరణ మనికూడా పరాశరస్మృతి చెప్పింది. మనుస్మృతి ‘గవా చాన్న మాఘ్రాతం వర్జయేత్సదా’ అని ఆవు వాసనచూచినా దాని నోటినుండి తీసికొనక దానికే వదలాలని, ‘గవాపహారీ గోధా జాయతే’ అంటే గోవు నపహరించినవాడు ఉడుముగా పుడతాడని చెప్పింది. నృగమహారాజుచరిత్ర ఇందుకు ఉదాహరణగా కన్పడుతుంది. శంఖస్మృతి ‘గోఘ్న శ్చాంధో భవేత్’ ఆవును చంపినవాడు అంధుడగునని చెప్తోంది. ‘గోమయాదినా సంస్కృతాయాం భూమౌ భుంజీత’ అని ఆవుపేడతో శుద్దిచేసినచోట భోజనం చేయమని వ్యాసుడు చెప్పాడు. గోవును కొట్టుట, తన్నుటల వలన మహాపాపం ప్రాప్తిస్తుందనీ స్మృతులు తెల్పాయి.


            పురాణవిషయాలకు వస్తే పద్మపురాణం సృష్టిఖండంలో గోముఖమునందే వేదాలున్నాయంటూ ఏ అవయవములం దే దేవతున్నదీ వివరింపబడింది. గోవునందు సకల దేవతలను దర్శించి మహర్షులు తెల్పారు. గోవు కుడికొమ్ముప్రక్క బ్రహ్మ, ఎడమప్రక్క విష్ణువు, కొమ్ముల చివర సకల తీర్థాలు, నుదుట శివుడు, ముక్కునందు సుబ్రహ్మణ్యేశ్వరుడు, చెవులందు అశ్వనీ దేవతలు, నేత్రములందు సూర్యచంద్రులు, నాలుకయందు వరుణుడు, గోవు ‘హిం’కారమున సరస్వతీదేవి, గండస్థలాల యమ, ధర్మదేవతలు, కంఠమున ఇంద్రుడు, వక్షస్థలాన సాధ్యదేవతలు, నాల్గుపాదాల ధర్మార్థకామమోక్షాలు, గిట్టలమధ్య గంధర్వులు, పృష్టభాగాన ఏకాదశరుద్రులు, పిరుదుల పితృదేవతలు, మూత్రమున గంగ, పాలలో సరస్వతి, భగమున లక్ష్మి భావన చేయదగినవారు. ఆవుపొదుగు అమృతసాగరస్థానం. ఇలా గోవు అగ్నిమయం. అమృతమయం, దేవమయం. అలాగే భవిష్యపురాణం ఉత్తరపర్వంలో ‘శృంగమూలే గవాం నిత్యం’ అంటూ స్కాందపురాణ రేవాఖండంలోను, మహాభారతం అశ్వమేధపర్వంలో కృష్ణుడు ధర్మరాజుకు గోదానమహిమ చెప్పుచునూ ఇలా గోవు సకలదేవతాస్వరూపాన్ని సకల శ్రుతిస్మృతి పురాణాదులు చెప్పాయి. అందుకే ‘సర్వదేవాః స్థితా గేహే-సర్వదేవమయీ హి గౌః’ అని గోవు సకలదేవమయికాన ఇంట్లో గోవుఉంటే సకలదేవతలు ఉన్నట్లే అని చెప్పబడింది. ఆ భావనతో గోవు నారాధించాలి. విష్ణుధర్మోత్తర పురాణంలో వరుణదేవుని కుమారుడు పుష్కరుడు పరశురాముని కోర్కెపై గోమతీవిద్య నుపదేశిస్తాడు. అది పాపాలను సమూలంగా నాశనంచేయగలదిగా చెప్పబడింది. బ్రహ్మాండ పురాణంలో గోసావిత్రీ స్తోత్రం ఉంది. గోవు సాక్షాత్తు విష్ణు స్వరూపమని, దాని అవయవము లన్నింటిలోను కేశవుడు విరాజమానుడై ఉన్నాడనికూడా చెప్పింది. భారతం అనుశాసనపర్వంలో చ్యవనమహర్షి నహుషునకు చెప్పిన గోమాహాత్మ్యంలో ‘గోభి స్తుల్యం న పశ్యామి ధనం కించి దిహాచ్యుత’ – గోధనంతో సమమైన ధనం లేదు. గోవును స్తుతించటం, గోవునుగూర్చి వినటం, గోదానం, గోదర్శనంకూడా గొప్ప పుణ్యాన్ని ఇచ్చేవని ఎన్నో విశేషాలు చెప్పబడినాయి. అందే భీష్మునిచే ధర్మజునకు గోవు, భూమి, సరస్వతి అనే ముగ్గురూ సమానమంటూ గోసేవ విధికూడా చెప్పబడింది. భవిష్యపురాణోత్తర పర్వంలో కృష్ణుడు ధర్మరాజుతో ‘ సముద్రమధన సమయంలో మాతృస్వరూపులగు నంద, సుభద్ర, సురభి, సుశీల, బహుళ అనే ఐదు గోవులుద్భవించాయని, వానిని క్రమంగా దేవతలు, జమదగ్ని, భరద్వాజ, వశిష్ట, అశిత, గౌతమ మహర్షులకు లోకకళ్యాణార్థం, యజ్ఞములద్వారా దేవతల్ను తృప్తి పరుప సమర్పించారని, ఇవన్నీ కోర్కెలన్నిటిని తీర్చగలవవటం వల్ల వీనిని కామధేనువు లన్నా’రని చెప్పాడు. ఇంకను గోవునుండి వచ్చేపాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, గోమయం, గోరోచనం అనే ఆరు గోషడంగాలు పవిత్రములు, పాపహరణాలని, శివ ప్రీతికరం, లక్ష్మీకరమైన బిల్వదళం, ఎర్రతామర, వాని బీజాలు గోమయమందే పుట్టాయని సుగంధమైన గుగ్గులు గోమూత్రం నుండి పుట్టెనని చెప్పబడింది. ఒకేవంశం గోవు, బ్రహ్మణులుగా విభజింపబడి మంత్రం, హవిస్సుల ద్వారా యజ్ఞకార్యమునకు నిర్ణయింపబడ్డాయని చెప్పబడింది. పద్మపురాణం సృష్టిఖండంలో బ్రహ్మ నారదునితో చెప్తూ, ‘భగవంతునినుండి గొప్ప తేజఃపుంజమేర్పడి అందుండి వేదాలు వచ్చాయని, అనంతరం అగ్ని, గో, బ్రాహ్మణులు వచ్చినందున ఈ నాల్గూ లోకం మనుగడకు ముఖ్యమైనవిగా వివరించాడు. గోప్రదక్షిణంవలన పాపం నశించి అక్షయ స్వర్గసుఖం లభిస్తుందని, గోప్రదక్షిణాలు చేయటంవలన మాధవుడు సర్వజన పూజ్యుడౌ, బృహస్పతి దేవతావంద్యుడు, ఇంద్రుడు సకలైశ్వర్య సంపన్నుడు అయ్యారని కూడా ఆ పురాణం చెప్పింది. అగ్ని పురాణంలో భగవంతుడైన ధన్వంతరిచే ఆచార్య శుశ్రుతునకు అనేక గోసంబంధమైన విషయాలు చెప్పబడ్డాయి. పంచగవ్యం ఎట్టివారినైనా పవిత్రం చేస్తుందని దానిని స్వీకరించే భిన్న పద్ధతులు, మహాసాంతపన వ్రతం, కృచ్ఛ్రాతికృచ్ఛ్రవ్రతం తప్తకృచ్ఛ్రవ్రతం, శీతకృచ్ఛ్రవ్రతం వంటివి చెప్పబడ్దాయి. ఇవన్నీ గొప్ప ఆరోగ్యసిధ్ధిప్రదాలు. గోమతీవిద్యా జపంవల్ల ఉత్తమ గోలోకప్రాప్తి చెప్పబడింది. విష్ణుధర్మోత్తర పురాణంలో కసాయివాని నుండి గోవును కొనడం, క్రూరమృగాలనుండి రక్షించడం గోమేధయజ్ఞఫలా న్నిస్తుందని, గోవ్రతం గూర్చి చెప్పబడింది. గోవును తాకడంచేతనే పాపక్షయ మవుతుందని స్కాందపురాణం ప్రభాసఖండం చెప్తోంది. ఇంకా ఋషిశాపంనుండి విముక్తికోసం శివుడు గోలోకం వెళ్ళి సురభిని స్తుతించినరీతి చెప్పబడింది. దశరధాదు లందరూ తాము చేయు యజ్ఞసందర్భాలలో వేలకొలది గోవులను దానంచేయటం చూస్తాం. రామాదుల పట్టాభిషేకాది కలపములందు గోదానాలు చేయబడినాయి. శ్రీకృష్ణుని లీల లన్నిటా గోవులకు, దూడలకు చాలాపాత్ర ఉంది. ఆవుపాల కంటే ఎక్కువ జీవనా ధారము, అభివృద్ధికరమునైన ఆహారపదార్థ మేదియు లేదని కశ్యప సంహిత చెప్పింది. శివపురాణ మందలి సనత్కుమాసంహితలో విభూది మహిమ చెప్తూ శివుడు పార్వతితో ఆవుపేడతో తయారు చేసిన భస్మమును ధరించుట లక్ష్మీప్రదము, తేజస్సును, మేధను పెంపొందిస్తుంది అంటాడు. అసలు విభూతి అంటే ఐశ్వర్యమే. లక్ష్మీస్థానమైన గోమయం వలననే దానికాస్థితి ఏర్పడింది. విభూతి ధారణవలన దేహమునందు విద్యుదుత్పత్తి జరుగుతుంది. అయుర్వృధ్ధి జరుగుతుంది. డా|| అనిబిసెంట్ విభూదిమహిమను తన గ్రంధంలో చెప్పటంవల్ల పాశ్చాత్యులు కొందరు గ్రహించు చుండగా మనంమాత్రం వదిలేస్తున్నాము.

Read the rest of this entry »

by Dr Annadanam Chidambara Sastry
http://www.jayahanumanji.com/
http://srihanumanvishayasarvasvam.blogspot.com/

Tuesday, April 26, 2011

గోమాత విశిష్టత – 3




ఇలాగే యజుర్వేదం (23-48) లో ‘బ్రహ్మా సూర్యసమం జ్యోతిః’ మంత్రంలో ‘గోస్తు మాత్రా న విద్యతే’ అని గోవునకు సమమైనది లేదని తెలుపబడింది. ‘గాం సీమాహిం రదితం విరాజమ్’ అని గోహింసను నిషేధిస్తోంది. ‘అంతకాయ గోఘాతమ్’ అని గోహంతకులను హతమార్చ మనికూడా యజుర్వేదం చెప్పింది. గోవధ అంతటి పాపమని గ్రహించాలి. అంతేకాదు ‘క్షుధేయాగాం విక్రేతం తం భిక్షమాణ ఉదితిష్టాశినమ్’ ని వేదం గోహంతకుడు భిక్షకై వచ్చినా భిక్ష పెట్టవద్దని, వానికి మరణమే శిక్ష ని చెప్తోంది. అధర్వణ వేదంకూడా గోవునందు సకలదేవత లున్నవిషయం చెప్పింది. ‘ఏకో గౌ రేక’ (8-9-26) లో గోవు పరోపకారులందు మొదటిదిగా చెప్పబడింది. ‘చతుర్నమో’ (11-2-9) మంత్రంతో గొప్పదగు గోవును సృజించిన భగవంతునకు వందనము సమర్పింబడింది. 12-4-5 లో గోవు పవిత్రజంతువని, పూజింపదగినదని చెప్పబడింది. అధర్వణ వేదం ‘పచతేవశాన్’ (1-114-10) మంత్రంలో గోమాంసమును ఇంటియందుకానీ మరెచ్చటకానీ వండువాడు, తినువాడు భ్రష్టుడు కాగలడని చెప్పటమేకాక గోవులందు, క్రౌర్యం చూపవద్దని, కత్తివంటి మారణాయుధాలను గోవుకు దూరంగా ఉంచమని చెప్పింది. ఇంత స్పష్టంగా చెప్తున్నా పవిత్రగోవునుగూర్చి కువ్యాఖ్యలు చేయబడి భ్రాంతికారణాలుగా కొన్ని తయారయాయి. గోమాంస భక్షణం వెనుకటి మునులు చేశారని, వేదపురాణాలలో అటువంటి ప్రసంగాలున్నాయని అంటారు. గౌ శబ్దాన్ని తప్పుగా వ్యాఖ్యానించుకొని చేసే విమర్శ అది. గౌ శబ్దానికి ఇంద్రియములనికూడా అని అర్థం. నేను గోవును తింటాను అంటే జితేంద్రియుడ నౌతాను అని యాజ్ఞవల్క్యుడు చెప్పాడు. దురదృష్టవశాత్తు దాన్ని అర్థం చేసికొనక గోహత్యను సమర్థించేవారు దాన్ని వాడుకొంటున్నారు. గోశబ్దానికి ఆవు, ఎద్దు, సూర్యుడు, యజ్ఞం, వాక్కు, దిక్కు, భూమి, గుర్రం, స్వర్గం, ఉదకం, వెంట్రుక, బాణం, వజ్రం, ముని, నేత్రం, పగ్గం, అల్లెత్రాడు వంటి ఎన్నో అర్థాలు తెల్లనిఘంటువుల లోనే ఉన్నాయి. ఇంకా నిరుక్తపరంగా ఎన్ని అర్థాలున్నాయో అవన్నీ ఆలోచించకుండా ఆవుగానే భావించి అపార్థాలు రానీయరాదు. అపార్థాలతో కావ్యాలలో కూడా తద్దినాలకు దూడమాంసాలు పెట్టినట్లు, గోమాంసాలు పెట్టినట్లు వ్రాశారనే విమర్శలున్నాయి. అవన్నీ వేదమంత్రాల అపార్థాలతో వచ్చిన ప్రమాదాలే. సంప్రదాయాన్ని నాశనం చేయటానికి ఇరికించబడిన కృత్రిమ వాక్యాలను, అపార్థాలను, కవుల అతిశయోక్తుల విపరీతధోరణులను ప్రక్కన పెట్టకపోతే మన ధర్మాలన్నీ ప్రమాదంలో పడతాయి. వేదము లన్నిటియందే కాక తత్సంబంధమైన కఠ, మైత్రాయణీయ, తాండ్య, జైమినీయ, శతపధాది బ్రాహ్మణ గ్రంధాలలో గోశబ్దంయొక్క నానార్థ రహస్యాలు చెప్పబడినాయి.



Read the rest of this entry »

by Dr Annadanam Chidambara Sastry

Tuesday, April 12, 2011

గోమాత విశిష్టత – 2

పంజాబ్ విశ్వవిద్యాలయం వారొక ప్రయోగం చేశారు. కొన్ని ఆవులు, కొన్ని గేదెలకు లెక్కప్రకారం కొంత మేతలో DDT కల్పి తినిపించారు. కొద్దిరోజుల తరువాత ఆ అవుల పాలలో 5% మాత్రమే DDT అంశాలుండగా ఆ గేదెల పాలలో 12% DDT ఉంది. DDT కల్పిన నీటితో గేదెల్ని కడిగినా వాటి పాలలో DDT అంశం ఉన్నట్లు తేలింది. ఆవులందు అలాకానరాలేదు. ఆవుపేడ, మూత్రములందున్న ఔషధగుణాలు, దివ్యశక్తి గేదెపేడ, మూత్రము లందు లేవు. ఆవుపేడవేసిన పైర్లకు పురుగు రాదు. పండే ధాన్యము పుష్టికరంగా ఉంటుంది. గేదెపేడతో పురుగు వ్యాపిస్తుంది. రసాయనాలవల్ల మరీ ఎక్కువగా పురుగు వ్యాపించే ప్రమాదముంది. అలా పండే పంటవలనా అనేక అనర్థాలున్నాయి. అవన్నీ నేడు మనం అనుభవిస్తున్నాం. ‘ఆరోగ్యం భాస్కరా దిచ్ఛేత్’ అని ఆరోగ్య శక్తి సూర్యునివలన లభిస్తుంది. గోవు వెన్నుపై సూర్యనాడి ఉంది. దానిద్వారా గోవు సూర్యకిరణములందలి సౌరశక్తిని ఆకర్షిస్తుంది. ఆ కారణంగా గోవు సంబంధ మైనవన్నీ పవిత్రములు, అరోగ్యప్రదములు అవుతున్నాయి. శ్రీకృష్ణపరమాత్మ 1) గోవు, 2) భగవద్గీత అనే రెండు పవిత్రవస్తువులను సమాజం ముందుంచాడు. గోవు, గురువు, గంగ, గాయత్రి, గోవిందుడు, గీతలను గకారషట్కం అంటారు. అందు గోవు ప్రధమస్థానీయం. ‘గవార్థే భూపతి స్సద్యః ప్రాణానపి పరిత్యజేత్’ అని గోవు కోసం రాజు ప్రాణత్యాగమైనా చేయవలనెనని చెప్పబడగా నేటి పాలకులు గోవుప్రాణాలనే హరిస్తున్నారు. ‘గో భూ తిల హిర ణ్యాజ్య – వాసో ధాన్య గుడాని చ, రౌప్యం లవణ మిత్యాహుః – దశదనాః ప్రకీర్తితాః’ అని దశదానాలలో తొలిదానం గోదానమే. ‘గోదానేన సమం దానం నాస్తి నాస్త్యేవ భూతలే’ అని గోదాన సమంలేదని చెప్పబడింది. ‘భూప్రదక్షిణ షట్కేన – కాశీయాత్రా యుతేన చ, సేతుస్నాన శతై ర్యచ్చ – తత్ఫలం గోప్రదక్షిణే’ అని గో ప్రదక్షిణం చేయుటవల్ల ఆరుసార్లు భూప్రదక్షిణం చేసిన ఫలం, పదివేలసార్ల కాశీయాత్ర, వందసార్లు సేతు స్నానము చేసిన ఫలితం చేకూరుతుంది. ‘గోభి ర్న తుల్యం ధన మస్తి కించిత్’ అని గోవుతో సమానమైన ధనంలేదు.
భారతదేశం గోజాతి సమృద్ధిగా ఉన్ననాడు స్వర్ణయుగాన్ని అనుభవించింది. అందుకే భారతదేశాన్ని గోవ్రత దేశంగా పిలిచేవారు. భారతదేశంలో కూడా తెలుగువారికి గోరక్షణ మరీముఖ్యమైనది. ఎందుకంటే మనకు ‘తెలుగు’వారను పేరు రావడానికి కారణం గోవే అని భాషాశాస్త్రం చెప్తోంది. ‘సరసా స్తిలవ ద్గావో – యత్రసన్తి సహస్రశః సదేశ స్తిలగుర్నామ’ అనేది అందుకు ప్రమాణవాక్యంగా చూపుతోంది. తిలలు అంటే నువ్వులు. నల్లని నూవులవలె నల్లగా ఉండే గోవులు శ్రేష్టములంటారు. ‘గోవుల లోపల కపిల బహు క్షీర’ అని చిన్నయసూరి బాలవ్యాకరణంలో వ్రాశాడు. తిలలవంటి గోవులు వేలాదిగా ఉన్న ఈ ప్రదేశం పూర్వం ‘తిలగు’ అని పిలువబడేదని, ఆ ‘తిలగు’ శబ్దంనుండే ‘తెలుగు’ శబ్దం వచ్చిందని భాషాశాస్త్రం వివరిస్తోంది. అలా మనం నిజమైన తెలుగువారం కావాలంటే గోవులను ఆంధ్రదేశమంతటా పోషించి వృధ్దిచేయాలి. ఈ గోవు హిందువులకు ఆరాధ్యదేవత. హిందూసాహిత్యం శ్రుతి స్మృతి పురాణాదిక మంతా గోవును పలువిధాల ప్రశంసిస్తోంది.

Read the rest of this entry »




Written by Dr. Annadanam Chidambara Sastry

Tuesday, April 5, 2011

గోమాత విశిష్టత – 1


గోసంరక్షణ హిందూధర్మంలో ప్రధానాంశం. ‘మానవ వికాసక్రమంలో గోరక్షణ అన్నిటికన్నా మిన్నయైన అలౌకిక విషయంగా నాకు తోస్తున్నది’ అంటారు గాంధీజీ. మన సంప్రదాయం గోవుకు సమున్నతస్థాన మిచ్చింది. ఒకవిధంగా ఆలోచిస్తే గోవు ప్రతి పుణ్యకార్యానికి అవసరమే. గోవు మన సంప్రదాయంతో అవిభాజ్యసంబంధం కల్గి ఉంది. గోవును తీసేస్తే మన సంప్రదాయం లేనట్లే అని చెప్పాలి. శివుని వాహనమైన నంది గోసంతతి. అది లేని శివాలయం లేదు. గోక్షీరం లేనిదే శివాభిషేకం కాదు. విభూది నిర్మాణం ఆవుపేడతోనే చేయ్యాలి. కావున శైవసంప్రదాయాన గోవు అవిభాజ్యం. గోపాలబాలకృష్ణుడు లేని వైష్ణవము లేదుకదా! సంక్రాంతి పండుగరోజులు పంటలువచ్చిన సుఖప్రదమైన కాలం. గంగిరెద్దులను గౌరవిస్తూ మనం ఆసుఖాలకు నోచు కొంటాము. గోమయం లక్ష్మీస్థానం.

Written by Dr. Annadanam Chidambara Sastry